కెసి వేణుగోపాల్‌తో సిఎం రేవంత్‌రెడ్డి భేటీ

ఢిల్లీ వెళ్లిన సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీతో కలిసి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో గురువారం రాత్రి భేటీ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ, పిసిసి కూర్పు, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు కులగణన గురించి కెసి వేణుగోపాల్‌తో వారు చర్చించారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపిలు పాల్గొన్నారు. నేడు ఏఐసిసి అగ్రనేతల రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సిఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు.



from Mana Telangana https://ift.tt/HZb8Qpz

Post a Comment

Previous Post Next Post

Below Post Ad